తెలంగాణ

telangana

ETV Bharat / city

RECORD: కొల్లి రాజశేఖర్‌, భజన రజని రికార్డు సృష్టించేశారు! - పలమనేరులో యోగా, ఫిట్‌నెస్‌ శిక్షకులు వార్తలు

ఆ భార్యభర్తలిద్దరూ డాక్టర్లు. అంతే కాదండోయ్ ..యోగా, ఫిట్‌నెస్‌ శిక్షకులు కూడా. ఇటీవల వారు చేసిన యోగాకు విడివిడిగానే కాకుండా గ్రూపు విభాగంలోనూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

RECORD: ఆసనాల్లో ఆరితేరారు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు..
RECORD: ఆసనాల్లో ఆరితేరారు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు..

By

Published : Jul 12, 2021, 10:52 PM IST

వారిద్దరూ డాక్టర్లు.. దంపతులు. ఒకే విద్యను అభ్యసించారు.. కృషి, పట్టుదలతో ఒకే విధమైన ప్రపంచ రికార్డు సాధించారు డాక్టర్‌ కొల్లి రాజశేఖర్‌, డాక్టర్‌ భజన రజని. ఇటీవల యోగావరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు పోటీలో ఇద్దరూ పాల్గొన్నారు. రజని.. ఉత్థాన ప్రిస్తాసన ఏకధాటిగా 29 నిమిషాల 10 సెకన్లు చేయగా, రాజశేఖర్‌.. ఉష్ట్రాసన 15 నిమిషాలు చేసి ప్రపంచ రికార్డు సాధించారు. జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ పోటీల్లో వివిధ దేశాల నుంచి దాదాపు 200 మంది పాల్గొన్నారు. మొత్తం 8 మంది న్యాయనిర్ణేతలు వీరిని ఎంపిక చేశారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా రాజశేఖర్‌, రజని తాము ఎంచుకున్న ఆసనాల్లో రికార్డు సాధించారు. గ్రూప్‌ పోటీల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మండూకాసనం 20 నిమిషాలు చేసి రికార్డు సృష్టించారు.

యోగా, ఫిట్‌నెస్‌ శిక్షకులుగా

రాజశేఖర్‌ది అనంతపురం జిల్లా. రజనిది చిత్తూరు జిల్లా పలమనేరు. ఇద్దరూ నెల్లూరు నారాయణ మెడికల్‌ కళాశాలలో 2011 సంవత్సరం మాస్టర్స్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ చేశారు. రజని మాత్రం ఆయుర్వేద పంచఖర్మ సర్టిఫికెట్‌ కోర్సు అదనంగా చేశారు. ఇద్దరి నడుమ బంధుత్వం ఉన్నందున పెద్దల సమక్షంలో 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014 సంవత్సరం కేరళ రాష్ట్రంలోని అలువాలో యోగా కోర్సులు చేశారు. అంతకు మునుపే 2011 సంవత్సరం పట్టణంలో ఫిట్‌నెస్‌ శిక్షకులుగా ఉంటూనే కేరళలో యోగా శిక్షణ పూర్తిచేశారు. అనంతరం ఇద్దరూ యోగా, ఫిట్‌నెస్‌ శిక్షకులుగా పట్టణంలో తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.

నాట్యంలోనూ ప్రవేశం

డాక్టర్‌ రజనికి యోగా, ఆయుర్వేదంతో పాటు నాట్యంలోనూ ప్రవేశం ఉంది. ఆమె భరతనాట్యం నేర్చుకుని ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు. చిన్ననాటి నుంచే నృత్యంతో అనుబంధం ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ కళను నేర్చుకున్నారు. నాట్యం కూడా ఓ విధమైన శారీరక శిక్షణగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎందులోనైనా ప్రత్యేకత ఉండాలి

మనకు తెలిసిన విద్యలో ఎందులోనైనా ప్రత్యేకత ఉండాలని రాజశేఖర్‌ అన్నారు. అందుకే తాము యెగా శిక్షకులుగా ఉన్నా.. కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తుంటామంటున్నారు. ప్రస్తుతం తాము ప్రదర్శించిన ఆసనాలను ప్రతి ఒక్కరికీ నేర్పించాలనే తపన ఉందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Congress Protest: 'పెట్రో' మంటపై కాంగ్రెస్ పోరు... నిరసనల హోరు

ABOUT THE AUTHOR

...view details