పాఠశాలల్లోని హాజరుపట్టీల్లో విద్యార్థుల కుల, మతాలను పేర్కొనవద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థుల పేర్లను నమోదు చేసే హాజరుపట్టీల్లో ఎక్కడా కులమతాలు ప్రస్తావించటం... బాలికల పేర్లను ఎర్ర సిరాతో రాయడం చేయొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ హాజరుపట్టీ నిర్వహణకు సంబంధించి ఏకరూప విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బందికి తక్షణం ఈ అంశాలపై అవగాహన కల్పించాలంటూ ప్రాంతీయ జాయింట్ డెైరెక్టర్లను, జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ ఈ అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు.