తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో డిజిటెక్ సెంటర్.. కేటీఆర్​తో 'కాల్ అవే గోల్ఫ్​' ఒప్పందం - digitech centre

DigiTech Centre in Hyderabad: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్‌ బృందం అమెరికాలో పర్యటిస్తూ వివిధ కంపెనీలతో సమావేశం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు యూఎస్​కు చెందిన కాల్‌ అవే గోల్ఫ్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు.

DigiTech Centre in Hyderabad
హైదరాబాద్​లో డిజిటెక్

By

Published : Mar 22, 2022, 4:04 PM IST

Updated : Mar 22, 2022, 7:33 PM IST

DigiTech Centre in Hyderabad: హైదరాబాద్​లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాల్ అవే గోల్ఫ్​ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. టాప్ గోల్ఫ్ బ్రాండ్​గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న కాల్ అవే.. హైదరాబాద్​లో నెలకొల్పనున్న నూతన డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మంది ఐటీ ప్రొఫెషనల్స్​కు ఉపాధి కల్పించనుంది.

కాల్ అవే ప్రకటనను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.. గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో తయారీ యూనిట్ నెలకొల్పాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని ఆహ్వానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.

ఫిస్కర్‌ సీఈఓతో భేటీ..

తన పర్యటనలో భాగంగా ఫిస్కర్‌ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్‌ బృందం సమావేశం అయింది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంబిస్తోన్న విధానాలను ఫిస్కర్‌ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. కేటీఆర్‌ ఆహ్వానం మేరకు ఫిస్కర్‌ సంస్థకు చెందిన బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి పెట్టుబడుల పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.

ఇదీ చదవండి:కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

Last Updated : Mar 22, 2022, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details