తెలంగాణ

telangana

'దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు'

By

Published : May 7, 2021, 2:16 PM IST

తెదేపా నేత దేవినేని ఉమ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​పై విచారణ జరిగింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉండగా దీనిని జూన్ 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

AP HC on Devineni Uma_No Actions, ap high court
దేవినేని ఉమపై హైకోర్టు వ్యాఖ్యలు, ఏపీ హైకోర్టు

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉన్నాయి. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జూన్‌ 17 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చుని ఏపీ హైకోర్టు తెలిపింది. ఆ రాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి:పన్ను ఆదాకు ఉత్తమ పెట్టుబడులు ఇవే..

ABOUT THE AUTHOR

...view details