తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలు అందించిన ఉపసభాపతి - ఉపసభాపతి పద్మారావు గౌడ్ తాజా వార్తలు

రూ.3 లక్షల విలువజేసే ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలను ఉపసభాపతి పద్మారావు గౌడ్ అందించారు. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సాలేహా బేగానికి నిమ్స్ చికిత్స కోసం ఇచ్చారు. నిరుపేదలకు మంచి వైద్యం అందాలని ఆకాంక్షించారు.

Deputy Speaker who provided Chief Minister's Assistance Fund documents
ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలు అందించిన ఉపసభాపతి

By

Published : Dec 17, 2020, 4:52 PM IST

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఐదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులతోపాటు.. వ్యక్తిగత ప్రయోజనం కల్పించే కార్యక్రమాలనూ ప్రభుత్వం చేపట్టిందని ఉపసభాపతి పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు సికింద్రాబాద్ నియోజవర్గంలో సీఎంఆర్​ఎఫ్​ నిధుల మంజూరు పత్రాలను అందించారు.

సికింద్రాబాద్​లోని ఉపసభాపతి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.3 లక్షల విలువజేసే ఈ పత్రాలను అందించారు. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సాలేహా బేగానికి నిమ్స్ చికిత్స కోసం ఇచ్చారు. ఉపసభాపతి పద్మారావు గౌడ్, తెరాస యువ నేత కిశోర్ గౌడ్ ఈ పత్రాలను అందించారు. పలువురు స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఓయూ విద్యార్థిపై ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరుల దాడి

ABOUT THE AUTHOR

...view details