తెలంగాణ

telangana

ETV Bharat / city

"క్యూనెట్​లో రూ.5వేల కోట్ల మోసం... బాధితుల్లో సినీ ప్రముఖులు"

క్యూనెట్​లో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్​ చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. సినీ ప్రముఖులకూ నోటీసులు పంపించామన్నారు. క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ సెల్లింగ్‌ కార్యాలయాన్ని సీజ్​ చేసినట్లు తెలిపారు. క్యూనెట్‌ బాధితులు లక్షల్లో ఉన్నారన్నారని సీపీ చెప్పారు.

By

Published : Aug 27, 2019, 1:46 PM IST

Updated : Aug 27, 2019, 4:43 PM IST

క్యూనెట్​లో ప్రజలెవరూ చేరవద్దు: సీపీ సజ్జనార్​

క్యూనెట్​లో ప్రజలెవరూ చేరవద్దు: సీపీ సజ్జనార్​

క్యూనెట్​లో ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల మేర మోసం జరిగిందని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు. క్యూనెట్‌ కేసులో సినీ ప్రముఖులకూ నోటీసులు పంపించామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో క్యూనెట్​పై కేసులు నమోదైనట్లు సజ్జనార్‌ వివరించారు. 206(5) కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఎంసీఏ ( కార్పొరేట్​ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో విచారణ జరిగినట్లు తెలిపారు. క్యూనెట్​పై చర్యలు తీసుకోవాలని నేషనల్​ కంపెనీ లా ట్రైబ్యునల్​కు ఎంసీఏ ఫిర్యాదు చేసిందన్నారు. క్యూనెట్ కేసులో 12 మందికి ఎల్వోసీ జారీచేశామన్నారు. క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ సెల్లింగ్‌ కార్యాలయాన్ని సీజ్​ చేసినట్లు తెలిపారు.

సాఫ్ట్​​వేర్​ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్​ కుంభకోణం జరిగిందన్నారు. మంచి అవకాశం పేరిట నిరుద్యోగులనూ మోసగించినట్లు పేర్కొన్నారు. క్యూనెట్‌ బాధితులు లక్షల్లో ఉన్నారన్నారని.. ప్రజలెవరు చేరవద్దని సీపీ సూచించారు.

ఇవీ చూడండి: 'జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదు'

Last Updated : Aug 27, 2019, 4:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details