తెలంగాణ

telangana

సైబరాబాద్​లో కఠినంగా లాక్​డౌన్ అమలు : సీపీ సజ్జనార్

By

Published : May 23, 2021, 2:25 PM IST

సైబరాబాద్​లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోందని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆదివారం కావడంతో భారీగా జనం వస్తారన్న అంచనాతో మరింతమంది సిబ్బందితో తనిఖీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

cp sajjanar, cp sajjanar about lockdown
సీపీ సజ్జనార్, లాక్​డౌన్​ అమలుపై సీపీ సజ్జనార్

సైబరాబాద్​లో లాక్​డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలవుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్​బీ, చింతల్‌, షాపూర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలును స్వయంగా పరిశీలించారు.

10 గంటల తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలను మూసేయించి... అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని సజ్జనార్‌ సూచించారు.

లాక్​డౌన్​ అమలును పరిశీలించిన సీపీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details