తెలంగాణ

telangana

ETV Bharat / city

అంబేడ్కర్​కు​ నివాళి అర్పించిన చాడ, రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్​ జయంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ జయంతి సందర్భంగా సీఐపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు చాడ, రామకృష్ణ అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

CPI LEADERS TRIBUTE TO AMBEDKER ON HIS BIRT ANNIVERSARY
అంబేడ్కర్​కు​ నివాళి అర్పించిన చాడ, రామకృష్ణ

By

Published : Apr 14, 2020, 9:00 PM IST

దేశంలోని సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఇతర దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్​ అందించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత 129వ జయంతి సందర్భంగా హిమాయత్ నగర్​లోని మక్దుం భవన్​లో కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, రామకృష్ణ అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాజపా కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కార్పొరేట్ సంస్థలు పెరిగి.. సహజ వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావస్వేచ్ఛకు భంగం కలిగించడం.. పౌరహక్కుల నేతలను అక్రమ అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:'మోదీ చెప్పినవి పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం'

ABOUT THE AUTHOR

...view details