తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 7:09 AM IST

ETV Bharat / city

సీఎం కేసీఆర్​తో కలిసి భోజనం చేసిన చాడ వెంకటరెడ్డి

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్​తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కలవగా... ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు.

సీఎం కేసీఆర్​తో కలిసి బోజనం చేసిన చాడ వెంకటరెడ్డి
సీఎం కేసీఆర్​తో కలిసి బోజనం చేసిన చాడ వెంకటరెడ్డి

సీఎం కేసీఆర్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో వీరిద్దరు మధ్యాహ్న సమయంలో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, చాడ వెంకట్‌రెడ్డి కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ చట్టంకు సంబంధించి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​కు మెమోరాండం అందజేశారు.

ఇదీ చూడండి: జేఈఈలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details