హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిథిలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బడాఖాన నిర్వహించారు. పనామా చెక్ పోస్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ స్వయంగా భోజనం వడ్డించారు. రెండవదశ లాక్డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద అంబర్పేట్, వర్డ్ అండ్ డీడ్ చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
చెక్పోస్టులను పరిశీలించిన రాచకొండ సీపీ
హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిథిలోని చెక్పోస్ట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ స్వయంగా భోజనం వడ్డించారు. రెండోదశ లాక్డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
సీపీ మహేశ్ భగవత్
అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలను అడ్డుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఇవీ చూడండి:'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి'