తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి' - పాతబస్తీ చార్మినార్‌ వద్ద పోలీసుల కవాతు

పాతబస్తీ చార్మినార్‌ వద్ద పోలీసులు కవాతు నిర్వహించారు. కవాతులో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ గుర్రంపై ఎక్కి సవారీ చేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది వివిధ దళాల పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేసేలా పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ చేపట్టారు.

cp anjani kumar said People should vote boldly and courageously
'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి'

By

Published : Nov 26, 2020, 8:32 AM IST

ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు.. చార్మినార్ వద్ద పోలీసులు ప్లాగ్‌మార్చ్ నిర్వహించారు.

'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి'

పాతబస్తీలోని రాజేష్ మెడికల్ హాల్, గుల్జారా హౌస్ మీదుగా నిర్వహించిన ఈ కవాతులో హైదరాబాద్ పోలీస్‌ కమిషన‌ర్‌ అంజనీకుమార్ పాల్గొన్నారు. సుమారు 400 మంది వివిధ దళాల పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలని సీపీ అంజనీకుమార్​ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 1న జరుగుుతండగా.. 4న కౌంటింగ్​కు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి :కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా

ABOUT THE AUTHOR

...view details