తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2021, 10:43 PM IST

ETV Bharat / city

20,636 మందికి వ్యాక్సిన్.. ముగ్గురికి రియాక్షన్

తెలంగాణలో 20,636 మందికి గురువారం వ్యాక్సిన్ ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే చాలా స్వల్పంగా రియాక్షన్ వచ్చిందని స్పష్టం చేసింది.

covid-vaccination-updates-in-telangana-20636-people-were-vaccinated-on-thursday-january
నేడు 20,636 మందికి వ్యాక్సిన్.. ముగ్గురికి స్వల్పంగా రియాక్షన్

రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గురువారం 487 సెషన్లలో.. 20,636 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం లక్షా 51 వేల 243 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొంది.

నేడు రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే చాలా స్వల్పంగా రియాక్షన్ వచ్చిందని.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు 58 శాతం మందికి వాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపింది.

ఇదీ చూడండి:భద్రాద్రి రామయ్యకు కోటికి పైగా ఆదాయం

ABOUT THE AUTHOR

...view details