Paritala Sreeram corona: కరోనా మూడో దశలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీ తెదేపా యువ నేత పరిటాల శ్రీరామ్కు కొవిడ్ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Paritala Sreeram corona positive: పరిటాల శ్రీరామ్కు కరోనా - పరిటాల శ్రీరామ్కు కరోనా
Paritala Sreeram corona positive: ఏపీ తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్కు స్వల్ప లక్షణాలు కన్పించగా కొవిడ్ టెస్టు చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.

Paritala Sreeram corona
‘"కరోనా పరీక్షలో స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండి, ఏవైనా లక్షణాలు కనబడితే టెస్టు చేయించుకుని జాగ్రత్త పండాల్సిందిగా తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో పరిటాల శ్రీరామ్ తెలిపారు.
ఇదీ చూడండి:Corona Effect on Events : కరోనా మహమ్మారి వేధిస్తోంది.. వేడుకలన్నీ రద్దు చేస్తోంది