తెలంగాణ

telangana

ETV Bharat / city

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు.

By

Published : Jul 30, 2021, 11:42 AM IST

పోసానికి కరోనా
పోసానికి కరోనా

సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్​ సోకిందని పోసాని తెలిపారు.


నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.

ఇదీ చదవండి:ప్రభాస్ 'రాధేశ్యామ్'​ సంక్రాంతికి రిలీజ్

ABOUT THE AUTHOR

...view details