సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్ సోకిందని పోసాని తెలిపారు.
పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు.
పోసానికి కరోనా
నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.
ఇదీ చదవండి:ప్రభాస్ 'రాధేశ్యామ్' సంక్రాంతికి రిలీజ్