తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కరోనా​ తగ్గుముఖం.. కొత్తగా 117 కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 117 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ బాధితుల సంఖ్య 8,87,466కి చేరింది.

By

Published : Jan 28, 2021, 10:48 PM IST

corona cases update in andhra pradesh
ఏపీలో కరోనా​ తగ్గుముఖం.. కొత్తగా 117 కేసులు

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 117 మందికి కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,466కు చేరగా... కరోనాతో 7,152 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 128 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 8.78 లక్షల మందికి పైగా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఏపీలో 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు కోటీ 30 లక్షలు దాటాయి.

ఇదీ చదవండి:'సివిల్'​ పరీక్షలు: కేంద్రం తీరుపై సుప్రీం అసహనం

ABOUT THE AUTHOR

...view details