తెలంగాణలో ఒక్కరోజే 5వేలు దాటిన కరోనా కేసులు - telangana corona news
![తెలంగాణలో ఒక్కరోజే 5వేలు దాటిన కరోనా కేసులు corona updates, covid updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11445848-428-11445848-1618721682504.jpg)
09:26 April 18
రాష్ట్రంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా
రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏకంగా ఐదు వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5వేల 93 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 15 మంది కొవిడ్-19కు బలయ్యారు. మరోవైపు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 37 వేలు దాటింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 743 కరోనా కేసులు కేసులు వెలుగు చూడగా... మేడ్చల్ జిల్లాలో 488, రంగారెడ్డి జిల్లాలో 407 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్లో 367, సంగారెడ్డిలో 232, కామారెడ్డిలో 232, జగిత్యాల జిల్లాలో 223 కరోనా కేసులు వచ్చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 175, మహబూబ్నగర్ జిల్లాలో 168 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
- ఇదీ చదవండి :రూ.లక్షలు వసూలు చేసి.. చివరి క్షణంలో గాంధీకి..