తెలంగాణ

telangana

AP Corona Cases: ఏపీలో కొత్తగా 150 కొవిడ్​ కేసులు, ముగ్గురు మృతి

By

Published : Nov 5, 2021, 6:52 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య(AP Corona cases) నిలకడగా కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా 150 కొవిడ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,760 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయని ఏపీ వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడించింది.

AP Corona Cases
ఏపీలో కొవిడ్​ కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 23,824 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 150 కొవిడ్ కేసులు(AP Corona cases), 3 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 217 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ కొవిడ్​ బులెటిన్​ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,760 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు..

కరోనా కారణంగా చిత్తూరు, గుంటూరు(AP Corona cases), కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అనంతపురంలో 4, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 28, కడపలో 9, కృష్ణాలో 24, కర్నూలులో 2, నెల్లూరులో 6, ప్రకాశంలో 5, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 13 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీచదవండి:TRS Vijaya Garjana Sabha: విజయగర్జన సభకు అడ్డంకులు.. భూములిచ్చేది లేదన్న రైతులు

ABOUT THE AUTHOR

...view details