తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మరణాలు - ఏపీలో కోవిడ్19 కేసులు

ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8 లక్షల 65వేల 705కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 6,970కి చేరింది.

ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మరణాలు
ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మరణాలు

By

Published : Nov 26, 2020, 7:59 PM IST

ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8 లక్షల 65వేల 705కు చేరింది. ఇప్పటివరకు కొవిడ్ కాటుకు 6వేల 970 మంది బలయ్యారు. కరోనా నుంచి మరో 1,081 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8 లక్షల 46 వేల మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం 12, 615 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 67, 269 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం 98 లక్షల 55 వేల పరీక్షలు చేశారు. కరోనాతో కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, విశాఖజిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

ఇదీ చూడండి:ఎల్​ఆర్​ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు

ABOUT THE AUTHOR

...view details