తెలంగాణలో మరో 143 మంది కరోనా వైరస్ బారిన పడగా.. ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహమ్మారి సోకిన వారి సంఖ్య 2,96,277కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1.614 మంది మరణించారు.
రాష్ట్రంలో 143 కరోనా కేసులు - ఒకరు మృతి - telangana corona cases today
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా మరో 143 మంది కొవిడ్ బారిన పడగా ఒకరు మృతి చెందారు. వైరస్ పట్ల అవగాహన, నిబంధనలు సక్రమంగా పాటించడం వల్ల మహమ్మారి వ్యాప్తి తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.
![రాష్ట్రంలో 143 కరోనా కేసులు - ఒకరు మృతి corona cases and deaths in telangana today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10593371-926-10593371-1613106952234.jpg)
తెలంగాణలో 143 కరోనా కేసులు
కరోనా నుంచి తాజాగా మరో 152 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 2,92,848కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,815 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 838 మంది హోంఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :దేశంలో మరో 9,309 మందికి కరోనా
Last Updated : Feb 12, 2021, 11:45 AM IST