హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రన్మస్త్ పుర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు గుర్తించారు.
రన్మస్త్ పుర ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలు కరోనా లక్షణాలతో మరణించింది. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబ సభ్యులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా గుర్తించినట్లు కాలాపత్తర్ ఎస్ఐ సుదర్శన్ తెలిపారు.