తెలంగాణ

telangana

కేసీఆర్​ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలి: మాణిక్కం

కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాన్ని గాంధీభన్​లో ప్రారంభించారు. రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ ఈ కార్యక్రమంలో​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్​ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.

By

Published : Feb 11, 2021, 3:34 PM IST

Published : Feb 11, 2021, 3:34 PM IST

congress state incharge manickam tagore addressed social media campaining launch
కేసీఆర్​ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలి: మాణిక్కం

కేసీఆర్ కుటుంబ సభ్యుల అప్రజాస్వామిక చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. ప్రచార కార్యక్రమాన్ని గాంధీభవన్​లో పీసీసీ సోషల్​ మీడియా ఛైర్మన్​ దీపక్​ జాన్​ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఠాగూర్​... భాజపా, మోదీ, అమిత్​ షా మాదిరిగా సోషల్ మీడియాలో అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు చేయవద్దని సూచించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల పోలింగ్​ బూత్​లకు కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్​లను నియమించాలని తెలిపారు. భాజపా, తెరాస చేప్తున్న అబద్ధాల గురించి... ప్రజలకు వాస్తవాలు వివరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రింట్​, ఎలక్ట్రానిక్ మీడియాపై పాలకుల పెత్తనం పెరిగినందున... ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యతం ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details