తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఫిర్యాదు కోసం వెళ్తే పోలీసులు అవమానించారు'

దిశను అత్యంత కిరాతకంగా హత్యచేశారని లోక్​సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ కుమార్తె కోసం ఫిర్యాదు చేసేందుకు వస్తే తమ పరిధిలో రాదంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పడం బాధకరమని పేర్కొన్నారు.

By

Published : Dec 2, 2019, 12:54 PM IST

uttam kumar reddy
uttam kumar reddy

దిశ హత్యాచార ఘటనలో పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే... విషాదం జరిగి ఉండేది కాదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దిశ హత్యాచార ఘటనపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దిశ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు అవమానించారని పేర్కొన్నారు. ఆ ప్రాంతం తమ పరిధిలో రాదంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పడం బాధకరమని అన్నారు.

ఘటనపై రాష్ట్ర హోమంత్రి మహమూద్‌ అలీ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని ఉత్తమ్‌ విమర్శించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

'ఫిర్యాదు కోసం వెళ్తే పోలీసులు అవమానించారు'

ఇదీ చూడండి: 'పూటుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు'

ABOUT THE AUTHOR

...view details