తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వాలు పేద ప్రజలపై పెనుభారం మోపుతున్నాయి: రేణుకాచౌదరి - మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి

Congress Protest on Fuel: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ... కాంగ్రెస్ పోరుబాట పట్టింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు టీకేఆర్ కమాన్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి పాల్గొని గ్యాస్‌ సిలిండర్లకు పూలమాలవేసి ప్రభుత్వాల తీరును ఎండగట్టారు.

Congress Protest on Fuel
Congress Protest

By

Published : Mar 31, 2022, 4:25 PM IST

Congress Protest on Fuel: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బీనగర్ ఇన్​ఛార్జ్ మల్​రెడ్డి రామ్​రెడ్డి ఆధ్వర్యంలో టీకేఆర్ కమాన్ వద్ద గ్యాస్ సిలిండర్లతో... మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నిరసన వ్యక్తం చేశారు.

'కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పేద ప్రజల నడ్డి విరుస్తూ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. పేద ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి తీసుకువచ్చాయి. ఈ ప్రభుత్వాలవి మాటలు తప్ప చేతలు లేవు. రెండు ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో గొడవ పడుతూ రైతులను నట్టేట ముంచుతున్నాయి.'

-రేణుకాచౌదరి, మాజీ కేంద్ర మంత్రి

ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్​రెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు శశిధర్​రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి

ఇదీ చదవండి:Bandi Letter To CM KCR: 'కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఎలా ఇస్తారు..?'

ABOUT THE AUTHOR

...view details