ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏప్రిల్ 3న అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో కవి సమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిందని సాంస్కృతిక శాఖ సంచాలకులు, మహోత్సవాల కమిటీ సభ్య కార్యదర్శి మామిడి హరికృష్ణ తెలిపారు. కవి సమ్మేళనానికి స్వాతంత్య్ర స్ఫూర్తిని థీమ్గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కవి సమ్మేళనాలు - telangana latest news
అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో ఏప్రిల్ 3న కవి సమ్మేళనాలు నిర్వహించాలని కలెక్టర్లను సాంస్కృతిక శాఖ సంచాలకులు కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
!['ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కవి సమ్మేళనాలు telangana government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11192432-159-11192432-1616927803609.jpg)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు గురించి నేటితరం యువత, పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని హరికృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను కోరారు.
ఇవీచూడండి:రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ఫ్రీడం రన్