తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరున్నరేళ్లుగా రైతులకు సీఎం కేసీఆర్‌ ఎంతో చేశారు: తలసాని - తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు

గడిచిన ఆరున్నరేళ్లుగా రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రైతులకు మేలు చేకూర్చడానికే నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా అన్నదాతలకు మేలు జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

Talasani srinivas yadav
Talasani srinivas yadav

By

Published : Sep 12, 2020, 4:11 PM IST

రైతులకు మేలు చేకూర్చడానికే సీఎం కేసీఆర్​ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గడిచిన ఆరున్నరేళ్లుగా రైతులకు కేసీఆర్‌ ఎంతో చేశారని పేర్కొన్నారు. పలు పథకాల ద్వారా ఆడపడుచులకు అండగా ఉన్నారని వివరించారు.

కేసీఆర్‌ కిట్‌ రూపంలో గర్భిణీలకు చేయూతనిస్తున్నారని తలసాని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు మేలు జరుగుతోందని మంత్రి చెప్పారు.

ఆరున్నరేళ్లుగా రైతులకు సీఎం కేసీఆర్‌ ఎంతో చేశారు: తలసాని

ఇదీ చదవండి:సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

ABOUT THE AUTHOR

...view details