ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన తొలి ఘనత విద్యుత్తోనేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. తలసరి విద్యుత్ వాడకంలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచినట్టు కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికామని వ్యాఖ్యానించారు.
అపార్టుమెంట్వాసులకు 20వేల లీటర్ల ఉచితనీరు: కేసీఆర్ - ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ
ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్తోనే తొలి ఘనత సాధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన ఘనత.. విద్యుత్: కేటీఆర్
కొద్ది నెలల్లోనే నగర ప్రజలకు, పేదలకు 24 గంటలు ఉచిత కానుకగా తాగునీరు అందించామని కేసీఆర్ అన్నారు. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశామని... అపార్ట్మెంట్ వాసులకు 20 వేల లీటర్ల ఉచిత నీరిందించనున్నట్టు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్నట్టు వివరించారు.