తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

74వ స్వాతంత్య్ర వేడుకలు ప్రగతిభవన్​లో నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని ​సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు.

By

Published : Aug 15, 2020, 10:36 AM IST

Updated : Aug 15, 2020, 12:03 PM IST

ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్

కరోనా దృష్ట్యా రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గోల్కొండలో జరగాల్సిన వేడుకలు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​, డీజీపీ మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకు ముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని ​సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. స్మారకం వద్ద పుష్పాలు సమర్పించి స్వతంత్ర సమరయోధుల సేవలు గుర్తుచేసుకున్నారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

Last Updated : Aug 15, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details