రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐప్యాక్ సేవలు కొనసాగించాలని తెరాస నిర్ణయించింది. సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర, తదితర అంశాల ప్రచారంలో ఐప్యాక్ సేవలను తెరాస వినియోగించనుంది. తెరాస అధినేత కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
కాంగ్రెస్ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో.. పీకే హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న(ఏప్రిల్ 23న) ఉదయం ప్రగతిభవన్కు చేరుకున్న పీకే.. రాత్రి వరకు కేసీఆర్తో చర్చలు జరిపారు. ప్రగతిభవన్లోనే రాత్రి బస చేసిన పీకే.. ఈరోజు(ఆదివారం) మరోసారి సీఎంతో భేటీ అయ్యారు.