తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2020, 1:53 PM IST

ETV Bharat / city

కరోనా వస్తే.. కేంద్రం కాలర్ ట్యూన్​ పెట్టి వదిలేసింది: భట్టి

కరోనా నియంత్రణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అనేక దేశాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముందుజాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.

batti
batti

కరోనా నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కరోనాపై నవంబరు నుంచే వార్తలు వస్తున్నాయని... ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కొవిడ్ 19పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని... కాలర్ ట్యూన్​ పెట్టి వదిలేసిందని భట్టి విమర్శించారు.

కరోనా వస్తే.. కేంద్రం కాలర్ ట్యూన్​ పెట్టి వదిలేసింది: భట్టి

ABOUT THE AUTHOR

...view details