తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2021, 3:50 PM IST

ETV Bharat / city

Tirumala: శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

cinema and political celebrities visited Tirumala
cinema and political celebrities visited Tirumala

తిరుమల శ్రీవారిని(tirumala srivaru) నేడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు(Cine political celebrities) దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai), దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Ts Dubaka MLA Raghunandan Rao), ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Finance Minister Bugna Rajendranath), ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ(CS Sameer Sharma), అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్, పుదుచ్ఛేరి స్పీకర్ ఆర్.సెల్వం, సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, ఎంపీ సీఎం రమేశ్​, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు (Film director Raghavendra Rao) స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

cinema and political celebrities visited Tirumala

ప్రముఖులకు తితిదే ఆధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి వేదికగా జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి వచ్చిన ప్రముఖులు.. నేటి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అరుదైన గుర్తింపు..

తాజాగా.. తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లండ్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది(Ttd Secures Place in World Book Of Records news). తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి (ttd chairman yv subba reddy )కి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details