తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2021, 11:42 AM IST

ETV Bharat / city

kathi mahesh: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్​ అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్​ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

kathi mahesh
కత్తి మహేశ్‌

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్(kathi mahesh)​ అంత్యక్రియలు(funerals) ఆంధ్రప్రదేశ్‌లో చిత్తురు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు జరుగనున్నాయి. పొలంలో అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం మహేశ్‌ను నెల్లూరు ఆస్పత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

చెన్నైలోని అపోలో(apollo hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ వైద్యం కోసం రూ.17లక్షలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అపోలోలో చికిత్స పొందుతూ జులై 10న కత్తి మహేశ్‌ మృతి చెందారు.

ఇదీ చదవండి:Ramson attack: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న ర్యాన్సమ్‌వేర్‌ దాడులు

ABOUT THE AUTHOR

...view details