తెలంగాణ

telangana

ETV Bharat / city

మానసిక రోగులను అక్కున చేర్చుకోనున్న సర్కార్! - chief secratary sk joshi meeting on rehabilitation centres for mental disabled

మానసిక స్థితి బాగాలేదని ఆస్పత్రిలో చేర్పించి, వ్యాధి నయమైనా ఏళ్ల తరబడి అక్కడే మగ్గుతున్న రోగులను తెలంగాణ సర్కార్​ అక్కున చేర్చుకోనుంది. మతిస్థిమితం లేక  బాధపడుతూ చికిత్స పొందిన వారి కోసం హాఫ్​ వే హోమ్స్​ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

chief secratary sk joshi meeting on rehabilitation centres for mental disabled

By

Published : Jul 16, 2019, 7:42 PM IST

మానసిక రోగులను అక్కున చేర్చుకోనున్న సర్కార్!

మానసిక స్థితి సరిగ్గాలేక ఆస్పత్రిలో చేరి వ్యాధి నయమైన తర్వాత కూడా ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ తన వారి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ యోచన చేసింది. వారి కోసం హాఫ్​ వే హోమ్స్​ నిర్మించాలని నిర్ణయించి, 15 రోజుల్లోగా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్​ ఎస్​కే జోషి అధికారులను ఆదేశించారు.

సైకియాట్రిస్ట్​ సేవలు తీసుకోండి

ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించి రిహాబిలిటేషన్​ నిర్మాణానికి సంబంధించిన నమూనా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని తెలిపారు. జీవన విధానం, ఒత్తిడి తదితర అంశాలన్నింటిపై మానసిక వైద్యులు, పారామెడికల్​ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైతే సైకియాట్రిస్టుల సేవలు వినియోగించుకోవాలన్నారు.

నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదన

జిల్లాలో మెంటల్​ హెల్త్​ బోర్టుల ఏర్పాటుకు అనుమతి కోసం హైకోర్టు రిజిస్ట్రార్​కు లేఖ రాయాలని అధికారులకు సీఎస్​ ఆదేశం జారీ చేశారు. దీన్​ దయాల్​ డిజెబుల్డ్​ రిహాబిలిటేషన్​ పథకం నుంచి నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు.

కర్ణాటక, తమిళనాడు తరహాలో

వైద్య, పారామెడికల్​ సిబ్బంది శిక్షణకు కర్ణాటక, తమిళనాడు తరహాలో కార్యచరణ రూపొందిస్తామని అధికారి శాంతికుమారి తెలిపారు. మెంటల్ హెల్త్ స్క్రీనింగ్‌కు నిర్దేశిత విధానాలు రూపొందించి వైద్య సేవలు అందిస్తామన్నారు. సైక్రియాటిస్ట్ అసోసియేషన్ల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details