మానసిక స్థితి సరిగ్గాలేక ఆస్పత్రిలో చేరి వ్యాధి నయమైన తర్వాత కూడా ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ తన వారి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ యోచన చేసింది. వారి కోసం హాఫ్ వే హోమ్స్ నిర్మించాలని నిర్ణయించి, 15 రోజుల్లోగా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు.
సైకియాట్రిస్ట్ సేవలు తీసుకోండి
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించి రిహాబిలిటేషన్ నిర్మాణానికి సంబంధించిన నమూనా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని తెలిపారు. జీవన విధానం, ఒత్తిడి తదితర అంశాలన్నింటిపై మానసిక వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైతే సైకియాట్రిస్టుల సేవలు వినియోగించుకోవాలన్నారు.