తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2021, 7:05 PM IST

ETV Bharat / city

Huzurabad election: 'నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టండి'

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఎక్కడా.. నగదు, మద్యం పంపిణీ లేకుండా చూడాలని ఆదేశించారు.

chief election officer Shashank goyal video confrence on huzurabad election
chief election officer Shashank goyal video confrence on huzurabad election

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ(huzurabad election campaign last date) సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా చూడాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

కఠినంగా అమలు చేయాలి..

ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని సీఈఓ ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ మోహరించాలన్న సీఈఓ... ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

నగదు పంపిణీపై నిఘా పెట్టండి..

డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడా.. నగదు, మద్యం పంపిణీ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగినట్లు దృష్టికి వస్తే.. వెంటనే నివేదికలు పంపాలని కలెక్టర్లకు తెలిపారు. పోలింగ్ సమయానికి 72 గంటల ముందు ప్రచారం ముగుస్తున్నందున.. తగిన చర్యలు తీసుకోవాలని శశాంక్ గోయల్ చెప్పారు. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకుండా చూడాలని చెప్పారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details