ఆనందయ్య శిష్యబృందంతో తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి భేటీ అయ్యారు. తిరుపతి తుడా కార్యాలయంలో ఆయన నిర్వహించిన సమావేశంలో ఆనందయ్య మనవడు వంశీకృష్ణ, మేనల్లుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయం - Chevireddy meet Anandayya disciples
ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే తితిదే ఆధ్వర్యంలో ఔషధం తయారుచేస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు.
![ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయం chevireddy-bhaskarreddy-met-with-anandayya-disciples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:00:22:1622014222-11902276-850-11902276-1622009613985.jpg)
ఆనందయ్య శిష్య బృందంతో చెవిరెడ్డి భేటీ.. ఔషధ తయారీపై చర్చ
ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే తితిదే ఆధ్వర్యంలో ఔషధం తయారుచేస్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోనే ఔషధ పరిశోధనకు ల్యాబ్ ఉందని. . ఆనందయ్య తయారు చేసిన మందును అక్కిడికే పంపుతున్నామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందనుకుంటున్నామని.. ఆనందయ్య ఔషధానికి ఆమోదం లభిస్తే లక్షల మందికి అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'
Last Updated : May 26, 2021, 1:43 PM IST