వలస కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి పలుచోట్ల వసతి, భోజన ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేస్తోంది. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు, వ్యవసాయ పనులకు వచ్చిన వేలాది వలస కార్మికులు రాజధాని నగరం, శివారు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో నివసిస్తున్నారు. కొందరు కంపెనీల షెడ్లలో, మరికొందరు అద్దె గదుల్లో ఉంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు తమకు నగదు, బియ్యం సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని గుర్తించలేకపోవడం కారణంగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పలుచోట్ల వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, భోజనం పంపిణీ చేస్తుండటం కొంత ఊరటనిస్తోంది.
కూలి పనికి అని వచ్చి... ఇరుక్కున్నాం
ఆరు నెలల క్రితం పది మంది కలిసి చౌటుప్పల్కు వచ్చామని కొంత మంది కార్మికులు చెబుతున్నారు. రోజుకు రూ.500 కూలీకి ఓ గుత్తేదారు వద్ద చేస్తున్న పని లాక్డౌన్తో ఆగిపోయింది. ప్రభుత్వం నుంచి సాయం అందలేదని వాపోయారు. రోజంతా గదిలోనే ఉండాల్సిన దుస్థితని... బయటకూ పోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గదుల వల్ల సమాజిక దూరం కూడా పాటించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులందరినీ ఆదుకుంటాం...