తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2020, 11:08 PM IST

ETV Bharat / city

బాల్యస్మృతులు గుర్తుచేసుకున్న చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు తన కళాశాల రోజులను గుర్తు చేసుకొని ఆ మధురానుభూతిని పొందారు. కంగుంది గ్రామానికి వెళ్లి ఎస్వీ యూనివర్సిటీలో తన స్నేహితుడు రత్నం కుటుంబాన్ని చంద్రబాబు కలిశారు.

chandrababu remembering college days
చిన్నానాటి రోజులు గుర్తుచేసుకున్న చంద్రబాబు

కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు తన స్నేహితుడి కుటుంబాన్ని కలిశారు. రత్నం తండ్రి పీఆర్ శ్యామ్​ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. యూనివర్సిటీలో తమ బ్యాచ్ ఫోటోలను చంద్రబాబుకు రత్నం చూపించారు. ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, ఆనాటి రోజులు, స్నేహాలు గుర్తొచ్చాయని చంద్రబాబు తెలిపారు. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందంటూ ట్వీట్ చేశారు.

బాల్యస్మృతులు గుర్తుచేసుకున్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details