తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎర్రన్నాయుడుకి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ - tdp leader erranaidu

దివంగత కేంద్ర మాజీమంత్రి, తెదేపా నేత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు ప్రజాబంధువు అని చంద్రబాబు కొనియాడారు. ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే కంచు కంఠం అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

cbn on erranna
cbn on erranna

By

Published : Feb 23, 2021, 4:30 PM IST

దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ప్రజాజీవితంలో ఆయన సేవలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

ఎర్రన్నాయుడు ప్రజా బంధువు: చంద్రబాబు

ప్రజాబంధువు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ధైర్యం, నిజాయతీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఆదర్శాలు, పోరాట స్ఫూర్తి.. బీసీలతో పాటు బడుగు, బలహీన వర్గాల వారందరికీ వరమయ్యాయని కీర్తించారు. పేదల పెన్నిధిగా, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, పార్లమెంట్​లో ఆంధ్రుల గంభీర వాణిగా విరాజిల్లారని గుర్తు చేశారు.

చంద్రబాబు ట్వీట్​

ఎర్రన్న కంచు కంఠం: లోకేశ్

ఎర్రన్నాయుడు అన్న పేరు కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఎర్రన్న అంటే ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే కంచు కంఠమని అభివర్ణించారు.

లోకేశ్​ ట్వీట్​

ఇవీచూడండి:అమితాబ్​కు మోహన్​లాల్​ ప్రత్యేక కానుక

ABOUT THE AUTHOR

...view details