ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శాంతిపురం మండలం కడపల్లె మాజీ సర్పంచ్ కృష్ణప్పను చంద్రబాబు పరామర్శించారు. నాలుగు నెలల క్రితం కృష్ణప్ప.. ప్రమాదవశాత్తు ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు. కృష్ణప్ప కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానని బాబు హామీ ఇచ్చారు.
"తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం. నన్ను మానసికంగా దెబ్బతీయాలని చూశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే పరిస్థితి లేదు"- చంద్రబాబు