తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2020, 2:48 PM IST

ETV Bharat / city

'గ్లోబల్ సిటీ కావాల్సిన నగరాన్ని ఫ్లడ్ సిటీగా మార్చారు'

హైదరాబాద్​లో భాజపా రాష్ట్ర నేతలతో కలిసి కేేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరేళ్లలో 60 వైఫల్యాలంటూ ఛార్జిషీట్ విడుదల చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న ప్రకాశ్ జావడేకర్... కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల ఆస్తులు అడ్డగోలుగా పెరుగుతున్నాయని ఆరోపించారు. గ్లోబల్ సిటీగా మారుస్తామని చెప్పి... ఫ్లడ్ సిటీగా మార్చారని మంత్రి దుయ్యబట్టారు.

'గ్లోబల్ సిటీ కావాల్సిన నగరాన్ని ఫ్లడ్ సిటీగా మార్చారు'
'గ్లోబల్ సిటీ కావాల్సిన నగరాన్ని ఫ్లడ్ సిటీగా మార్చారు'

'గ్లోబల్ సిటీ కావాల్సిన నగరాన్ని ఫ్లడ్ సిటీగా మార్చారు'

గతంలో జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలమైందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవడేకర్‌ ఆరోపించారు. ఆరేళ్లలో 60 వైఫల్యాలంటూ బల్దియాలో తెరాస పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. తెలంగాణలో కేసీఆర్‌, ఓవైసీ కుటుంబ పాలన నడుస్తోందని జావడేకర్ ఆరోపించారు.

వరదల వల్ల హైదరాబాద్‌ 15 రోజులు నీళ్లలోనే ఉండిపోయిందని... కనీసం డ్రైనేజీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. గ్లోబల్ సిటీ అని చెప్పి ఫ్లడ్ సిటీగా మార్చారని ప్రకాశ్ జావడేకర్ ఆక్షేపించారు. వరద సాయం సొమ్ములో సగం తెరాస నాయకుల జేబుల్లోకే వెళ్లిందన్నారు.

ఇదీ చూడండి: రెండు పడకల ఇళ్లకోసం తెరాసను నిలదీయండి: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details