విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న ‘తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు... లేఖ రాశారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షగా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగానే... ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్టు ఆయన వెల్లడించారు.
'స్మారక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సహకరించండి' - తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి లేఖ
తెలంగాణ విమోచన పోరాటం గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకొని స్పూర్తి పొందాల్సిన అవసరం ఉందని... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు మ్యూజియం ఏర్పాటుకు భూమి కేటాయించి, వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.

'స్మారక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సహకరించండి'
తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన అమరవీరుల చిత్రపటాలతో కూడిన మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా లేఖలో కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా... తెలంగాణ ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తిగా... ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించి, నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.