తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉచిత బియ్యం పంపణీ గడువు పొడిగిస్తాం: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి - ఉచిత బియ్యం పంపణీ గడువు పొడిగిస్తాం

Kishan Reddy: హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్​లో హిమాయత్​నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో... ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ముఖ్యఅథితిగా విచ్చేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

central minister kishan reddy participated in Rangoli competition in Hyderabad
central minister kishan reddy participated in Rangoli competition in Hyderabad

By

Published : Jan 10, 2022, 5:04 AM IST

Kishan Reddy: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ హైస్కూల్​లో హిమాయత్​నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో... ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి.. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ముగ్గులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ వాక్సిన్ ఇస్తూ... కరోనాను అరికట్టేందుకు చేస్తున్న కృషి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని కిషన్​రెడ్డి తెలిపారు. గతేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూనే ఉందన్నారు. మళ్లీ థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. పాడిపంటలు పశుసంపద బాగుండాలని... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు చేసుకునే సంక్రాంతి పండుగ దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు జరుపుకుంటున్నాయని తెలిపారు.

ఉచిత బియ్యాన్ని మరి కొన్ని నెలలు పొడిగించి ఇస్తామని కిషన్​రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున.. అందులో భాగంగా నిర్వహించే ముగ్గుల పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ ముగ్గులను యాప్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి పంపించాలని కేంద్రమంత్రి కోరారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details