Kishan reddy letter to CM KCR: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైల్వే ప్రాజెక్టుల్లో ఆలస్యం అవుతోందని.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల్లో కేంద్రం అన్యాయం చేస్తోందని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలను కిషన్రెడ్డి ఖండించారు. విమర్శలు మానుకొని రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయం, భూకేటాయింపులు త్వరిగతిన పూర్తిచేయాలని చురకలంటించారు.
"రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం న్యాయం చేయడం లేదని తెరాస ప్రతినిధులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు చేసే ముందు రాష్ట్రానికి ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయాన్ని.. భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలి." అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ