నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వందల బస్తీల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని కిషన్రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా చూసుకోవచ్చు అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
సమగ్ర కార్యాచరణతోనే వరదలకు చెక్: కిషన్ రెడ్డి
భారీ వర్షాలతో నగరంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించుకుంటే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం కాకుండా చుసుకోవచ్చిని తెలిపారు.
సమగ్ర కార్యాచరణతోనే వరదలకు చెక్: కిషన్ రెడ్డి
Last Updated : Oct 15, 2020, 5:03 PM IST