తెలంగాణ

telangana

ETV Bharat / city

Double Bed Room Houses: డబుల్ ట్రబుల్... జాబితా ఇస్తేనే నిధులు - ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం

Double Bed Room Houses: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధుల వాటా డబ్బుల విడుదలకు లబ్ధిదారుల జాబితాతో కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు మరికొంత గడువు కోరింది. దీంతో మొత్తం నిధుల విడుదలకు ఇళ్ల పంపిణీ తర్వాతే మార్గం సుగమం అయ్యే పరిస్థితి నెలకొంది.

Double bed rooms
Double bed rooms

By

Published : Apr 3, 2022, 8:40 AM IST

Double Bed Room Houses: తెలంగాణలో పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర నిధుల వాటా డబ్బుల విడుదలకు లబ్ధిదారుల జాబితాతో కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టింది. రెండో విడతగా కేంద్రం నుంచి రూ.723 కోట్ల నిధులు రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా ఇచ్చేందుకు మూడు నెలల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కోరగా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఈ మొత్తం విడుదలకు ఇళ్ల పంపిణీ తర్వాతే మార్గం సుగమం అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్బన్‌, గ్రామీణ్‌ పథకాల కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. నిర్మాణవ్యయం హైదరాబాద్‌లో రూ.7 లక్షలు, పట్టణాల్లో రూ.5.70లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు అవుతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు రూ.72వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తోంది.

పంపిణీ ఆలస్యమే..రెండు పడక గదుల ఇళ్లు 2.91 లక్షలు మంజూరు కాగా, నిర్మాణం పూర్తయినవి.. ఇంకా చిన్నచిన్న పనులు చేయాల్సినవి కలిపి 1.82 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్ల సంఖ్య 17వేలు మాత్రమే. పూర్తయిన ఇళ్ల పంపిణీ 2, 3 నెలల్లో జరిగే అవకాశం ఉంది.

గ్రామీణ ఆశలపై నీళ్లు..గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వాటా రూ.381.58 కోట్లు కాగా రూ.190 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగిలినవి రావడం సందేహమేనని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. సామాజిక కులగణన సర్వే-2011 ప్రకారం ఎంపిక చేయాలని, ఆ మేరకు లబ్ధిదారుల పేర్లతో జాబితాను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని కోరుతోంది. కానీ కేంద్రం నిబంధనల సడలింపునకు అంగీకరించలేదు. దీంతో గ్రామీణ ఇళ్లకు కేంద్రంనుంచి రావాల్సిన మిగులు నిధుల రాకపై ఆశలు సన్నగిల్లాయి.

ఇదీ చదవండి:సన్నరకం వరికి సరే కానీ.. విత్తనాలకు రాయితీ లేనట్టే!

ABOUT THE AUTHOR

...view details