తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎస్​లతో కేంద్ర కేబినెట్​ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష - రాష్ట్రాల్లో పరిస్థితులపై రాజీవ్​ గౌబ ఆరా

అన్ని రాష్ట్రాల సీఎస్​లు​, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు.

video conference
రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేబినెట్​ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష

By

Published : Mar 26, 2020, 5:45 PM IST

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ సీఎస్​ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాలు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలపై కేంద్రం అధికారులు ఆరా తీశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రజల అవసరాలకు సరిపడా సరకులు అందుబాటులో ఉంచినట్లు కేంద్రానికి నివేదించారు తెలంగాణ అధికారులు.

ఇవీచూడండి:'ఎపిడెమిక్ డిసీజ్ చట్టం' అంటే ఏంటో తెలుసా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details