తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కి వాయిదా

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. సీఎంగా పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్న జగన్​ అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం.. ఇవాళ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్​ప్రసాద్​రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.

By

Published : Feb 28, 2020, 9:06 PM IST

cm ys jagan-cbi court
cm ys jagan-cbi court

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్​ హాజరుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ మినహాయింపు ఇచ్చింది. సీఎంగా పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున.. మినహాయింపు ఇవ్వాలన్న జగన్​ అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. ఈ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్​ప్రసాద్​రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్​ దాఖలు చేసిన డిశ్చార్జ్​ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి మోసపూరితంగా జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులు పెట్టించారన్న కేసులో జగన్​కు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయవాది అశోక్​రెడ్డి వాదించారు. వాదనల అనంతరం విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details