ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు (jagan disproportionate assets case)ల్లో పెన్నా ఛార్జ్షీట్పై సీబీఐ కోర్టు (CBI Court) విచారణ జరిపింది. గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్(discharge petition)పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. పెన్నా కేసు నుంచి రాజగోపాల్ను తొలగించొద్దని కోర్టును కోరింది.
jagan disproportionate assets case: పెన్నా సిమెంట్స్ ఛార్జ్షీట్పై విచారణ వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు
పెన్నా కేసు నుంచి గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్ను తొలగించొద్దని సీబీఐ కోర్టును.. కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. ఈ మేరకు రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్ (discharge petition)పై సీబీఐ(CBI).. కౌంటరు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్షీట్పై విచారణను జులై 6కు వాయిదా వేసింది.

పెన్నా సిమెంట్స్ ఛార్జ్షీట్పై విచారణ వాయిదా
శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. సాంకేతిక కారణాలతో పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు వెనక్కి ఇచ్చింది. పెన్నా సిమెట్స్ ఛార్జ్షీట్పై విచారణను జులై 6కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:లక్కీడ్రాలో గిఫ్టు వస్తుందన్నారు... డబ్బు కట్టించుకుని ముఖం చాటేశారు