రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులు ఏర్పాటుచేసినట్లు హైదరాబాద్ కుషాయిగూడ డివిజనల్ మేనేజర్ జగన్ తెలిపారు. అల్వాల్లో ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీస్ బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు.
కార్గో సర్వీస్ శాఖను ప్రారంభించిన ఆర్టీసీ డీఎం - tsrtc cargo latest news
హైదరాబాద్ కుషాయిగూడలో కార్గో, కొరియర్ సేవలను ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ జగన్ ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్గో సర్వీస్ శాఖను ప్రారంభించిన ఆర్టీసీ డీఎం
అనంతరం ఆర్టీసీ కార్గో ఛార్జీలను ప్రకటించారు. ఇంటి సామగ్రి, వ్యాపార వస్తువుల తరలింపునకు 50 కి.మీ వరకు.. 8 టన్నులకు రూ.4,060.. 3 టన్నులకు రూ.3,615 వసూలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.