సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్నట్లు కంటోన్మెంట్ రెండో వార్డు సభ్యులు సధాకేశవ రెడ్డి తెలిపారు. రసూల్పురాలోని జిల్లాపరిషత్ స్కూల్ వద్ద సీసీ రోడ్లు, నీటి పైప్లైన్ పనులు ప్రారంభించారు.
'కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధే లక్ష్యం' - తెలంగాణ వార్తలు
కంటోన్మెంట్లోని రెండో వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రసూల్పురాలోని జిల్లా పరిషత్ స్కూల్ వద్ద సీసీ రోడ్లు, నీటి పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంతోపాటు ఇతర సమస్యలూ పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.

'కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధే లక్ష్యం'
కంటోన్మెంట్లో మురికివాడగా పేరున్న రసూల్పుర ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ.. మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంతోపాటు ఇతర సమస్యలూ పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఇంఛార్జి అశోక్ గౌడ్, జబ్బర్, ధన్రాజ్, శ్రీను, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.