'ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. గ్రేటర్ పీఠం గులాబీదే'
భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గ్రేటర్ హైదరాబాద్ పీఠం తెరాసదేనని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా ఆరోపణలు.. తెరాస తలపెట్టిన జాతీయ సదస్సు వంటి అంశాలపై వినోద్ కుమార్తో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి..